తిరుపతిలో 35వ అఖిల భారత బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదిక
Published by
brbalu360
on
తిరుపతి బస్టాండ్ ఎదురుగా అంకాలమ్మ గుడి సమీపంలోని ఎస్.ఆర్ కన్వెన్షన్ హాల్లో మే 31న బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదిక నిర్వహించనున్నారు. మే 30న సాయంత్రం శివపార్వతుల కళ్యాణం సాంప్రదాయబద్ధంగా జరగనుంది. అలాగే షష్టిపూర్తి, భీమరథ శాంతి, సహస్ర చంద్రదర్శన కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 8 గంటల నుండి స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించారు.
Leave a comment