తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయ (SVVU) ఆవరణలో గత కొంతకాలంగా భయాందోళనలు రేకెత్తిస్తున్న చిరుతపులి ఎట్టకేలకు అటవీ శాఖ అధికారులకు చిక్కింది. గడిచిన రెండు నెలలుగా విశ్వవిద్యాలయ విద్యార్థులను, సిబ్బందిని రాత్రింబగళ్లు వణికించిన చిరుత. గమనించిన సిబ్బంది అప్రమత్తమై వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది, వర్సిటీ అధికారుల సహకారంతో చాకచక్యంగా వ్యవహరించారు. చిరుత బయటకు రాకుండా గది తలుపులు మూసివేసి, ప్రత్యేక బోనుని ఏర్పాటు చేశారు. పక్కా ప్రణాళికతో ఆ చిరుతను బోనులో బంధించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఆ చిరుతను తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర జూపార్కుకు తరలించారు.

Leave a comment