డాక్టర్ పీవీఎన్ కృష్ణ రచన, దర్శకత్వంలో రూపొందిన ఈ నాటికలో భూలోకంలో పెరుగుతున్న పాపాలకు ఆకలి, దప్పికలు ఎలా ప్రధాన కారణాలుగా మారాయనే పౌరాణిక కథాంశాన్ని పద్యరూపంలో ఆవిష్కరించారు.
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మానవ రూపాలు ధరించడం, సరస్వతీదేవి శాపం, కృష్ణ–వేణి నదుల ఆవిర్భావం వంటి ఘట్టాలను కళాకారులు తమ అద్భుతమైన నటనతో ప్రదర్శించారు.
పద్యాలు, సంగీతం, అభినయం, రంగస్థల ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నాటిక ముగిసిన అనంతరం ప్రేక్షకుల నుంచి కళాకారులకు, నాటక బృందానికి మంచి స్పందన లభించింది.

Leave a comment