
తిరుపతిలోని గాంధీ రోడ్లో కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
టీటీడీ బోర్డు సభ్యుడు జి. బాను ప్రకాష్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మబ్బు దేవనారాయణ రెడ్డి తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా బైరాగిపట్టెడలోని డాక్టర్ రామానాయుడు నగరపాలక ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు రూ.30 వేల విలువైన నోట్బుక్స్, స్టేషనరీని పంపిణీ చేశారు.
అలాగే ట్రస్ట్ 101వ సేవా కార్యక్రమాన్ని పురస్కరించుకుని సంస్థకు సేవలందించిన పలువురికి ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేసి సత్కరించారు.
దేశ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు.
Leave a comment