న్యూఢిల్లీలో నిర్వహించిన పోర్టులు, నౌకాయాన మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ హిందీ సలహా సంఘం తొలి సమావేశంలో హిందీ అమలుకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో హిందీ సలహా సంఘం సభ్యులు, వివిధ కేంద్ర శాఖల ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సమావేశంలో నూతన సభ్యులకు కేంద్ర మంత్రి స్వాగతం పలికి జ్ఞాపికలు అందజేశారు. అధికార భాష అమలులో విశేష కృషి చేసిన శాఖలు, అధికారులు, ఉద్యోగులను అవార్డులతో సత్కరించారు.
ఈ సందర్భంగా డా. పి.సి. రాయులు కేంద్ర మంత్రిని ఘనంగా సన్మానించి, హిందీ సలహా సంఘంలో సభ్యునిగా అవకాశం కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పోర్టులు, నౌకాయాన మరియు జలమార్గాల రంగంలో రాజభాష హిందీ వినియోగాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు తన పూర్తి సహకారం అందిస్తానని స్పష్టం చేశారు.

Leave a comment