తిరుపతిలో మన్నూరు వెంకట రమణ ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కాంచీ కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామిజీ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
విద్య, సంస్కారం, విలువలతో కూడిన భావితరాలను తీర్చిదిద్దే లక్ష్యంతో మన్నూరు వెంకట రమణ ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌ను ప్రారంభించారు. తిరుపతి కేఎల్‌ఎం సర్కిల్ సమీపంలో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు, విద్యావేత్తలు, భక్తులు హాజరై ట్రస్ట్ కార్యకలాపాలకు తమ మద్దతు తెలిపారు.

Leave a comment